Tuesday, May 14, 2024

మేడారంలో ఆంధ్రప్రభ కార్యాలయం ప్రారంభం

మేడారం (ప్రభ న్యూస్): ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఆంధ్ర‌ప్ర‌భ ఆఫీసు ప్రారంభ‌మైంది. వాస్తవ కథనాలను, మేడారం జాతర అప్డేట్స్ ఎప్పటిక‌ప్పుడు పాఠకులకు అందించేందుకు ఆంధ్రప్రభ దిన పత్రిక కార్యాలయాన్ని రెడ్డి గూడెంలో ఏర్పాటు చేశారు.

ఆఫీసును వరంగల్ బ్యూరో తుమ్మల కృష్ణా రెడ్డి , ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాంచ్ మేనేజర్ తిరుపతి రెడ్డి, ఆర్ఎమ్ జగపతితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భూపాలపల్లి స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, ములుగు ఆర్సీ ఇన్‌చార్జి సుమన్ తో పాటు.. తాడ్వాయి, గోవిందారావు పేట, ఏటూరు నాగారం, మంగపేట, మల్లంపల్లి విలేక‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement