Thursday, May 2, 2024

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో రోడ్డు ప్ర‌మాదం – ఒక‌రి దుర్మ‌ర‌ణం

మహబూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఒకరు దుర్మ‌ర‌ణం చెందారు. . పట్టణంలోని అవంతి హోటల్ ఎదురుగా ఓప్రైవేట్ కళాశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని, లారీ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జిల్లా కేంద్రానికి చెందిన సత్యనారాయణ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాక ప్రతిభ కళాశాల బస్సు డ్రైవర్ కు , బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాల‌య్యాయి. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement