Tuesday, May 7, 2024

లక్ష సభ్యత్వాలే లక్ష్యం … మంత్రి గంగుల

కరీంనగర్ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోనే కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీ ఒక టిఆర్ఎస్ మాత్రమే అన్నారు. పార్టీకి కార్యకర్తలు వెన్నుముక లాంటి వారని, వారి సహకారంతోనే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది అన్నారు. రాష్ట్రంలో లో పలు రోజులపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని 60లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement