Monday, April 29, 2024

ADB: అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

తాండూర్, ఆగస్టు 9 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం గోపాల్ నగర్, అచలాపూర్, రేచిని క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతిచెందారు. మృతుడు అచలాపూర్ గ్రామానికి చెందిన సిద్ధం శీనుగా గుర్తించారు. రోడ్డు పక్కన మూడు కూడళ్ల వద్ద శవమై ఉండటంతో, ఈ ఘటన మండల వ్యాప్తంగా దవానంలా వ్యాపించింది. తాండూర్ ఎస్సై రాజశేఖర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియరాలేదు.


Advertisement

తాజా వార్తలు

Advertisement