Saturday, May 4, 2024

కేటీఆర్​ బర్త్​డే సందర్భంగా, వరద బాధితులకు కోటి రూపాయల సరుకులు ఇవ్వనున్న‌ పొంగులేటి

తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ హంగామా చేయొద్దని, హడావిడి కార్యక్రమాలతో డబ్బు ఖర్చుపెట్టొద్దని మంత్రి కేటీఆర్​ తెలిపారు. అంతేకాకుండా వరదలతో ఇబ్బంది పడుతున్న వారికి, ఇతర అత్యవసర పరిస్థితులున్న వారికి ‘గిఫ్ట్​ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఆదుకోవాలని కోరారు. ఈ పిలుపుతో ముందుకు వచ్చారు ఖమ్మం టీఆర్​ఎస్​ లీడర్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి. ఈ మధ్య గోదావరి వరదలతో నష్టపోయిన దాదాపు 15వేల మంది కుటుంబాలకు సాయం చేయాలని డిసైడ్​ అయ్యారు.

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో గిఫ్ట్​ ఏ స్మైల్​ ప్రోగ్రామ్​ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సుమారు కోటి రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలను ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్​ తుళ్లూరి బ్రహ్మయ్య కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement