Friday, May 3, 2024

పెంకుటిల్లు కూలి వృద్ధురాలు మృతి.. ములుగు జిల్లాలో ఘ‌ట‌న‌

మంగపేట, (ప్రభ న్యూస్) : వర్షానికి ఇల్లు కూలడంతో ఓ వృద్దురాలు చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న ములుగు జిల్లాలో జ‌రిగింది. మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన సోయం మంగమ్మ ( 60 ) ఆదివారం రాత్రి ఇల్లు కూలి చ‌నిపోయిన‌ట్టు స్థానికులు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోయం మంగమ్మకు చెందిన ఇల్లు ఆదివారం అర్ధ‌రాత్రి కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో మంగమ్మ ఇంట్లో నిద్రపోతోంది. దీంతో ఆమెపై ఇల్లు కూలడంతో చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు ఇంట్లో నుంచి బయటకు తీశారు. మంగమ్మకు భర్త , పిల్లలు ఎవరూ లేరు. ఒంటరిగా ఉంటోంద‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement