Friday, May 10, 2024

విశ్రాంత టీటీడీ ఉద్యోగి దారుణ హత్య.. ప‌క్కింటివాళ్లే చంపార‌న్న అనుమానం

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : ఏపీలోని తిరుపతి సిటీలో దారుణం జ‌రిగింది. ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లిపట్టెడలో కాపురం ఉంటున్న రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ విష‌యాన్ని ఇవ్వాల (సోమ‌వారం) పోలీసులు వెల్ల‌డించారు. మృతుడు నారాయణస్వామి (63)గా పోలీసులు పేర్కొన్నారు. కాగా, అత‌ను త‌న భార్య‌తో చాలా రోజుల క్రిత‌మే విడాకులు తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ఒంట‌రిగా జీవిస్తున్నాడు. అయితే త‌న ఇంటి పక్కనే ఉంటున్న వాళ్లు బంగారం దొంగిలించార‌న్న కార‌ణంగా పోలీసుల‌కు కంప్లెయింట్ ఇచ్చాడు.

దీనిపై ఎంఆర్ పల్లి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలో క్రైమ్ పోలీసులు వచ్చి నిందితుల‌ను విచారించారు. ఇంతలోనే ఆయ‌న అతి దారుణంగా కత్తిపోట్లతో చ‌నిపోవ‌డం ప‌క్కింటి వారి ప‌నిగానే అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే హ‌త్య అనంత‌రం నిందితులు ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement