Sunday, May 19, 2024

TSRTCలో అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ వంటి నాన్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నాన్‌ ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌ పోస్టుల్లో 150 ఖాళీగా ఉన్నాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21-30 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్‌ పీరియడ్‌ మూడేళ్లు ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.15వేలు, రెండో సంవత్సరంలో నెలకు రూ.16వేలు, మూడో సంవత్సరంలో నెలకు 17వేలు స్టైఫండ్‌ అందించనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement