Tuesday, May 7, 2024

SAMSUNG: భారీ ఆఫర్‌లతో గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించిన శాంసంగ్

హైద‌రాబాద్ : భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వేరబల్ వస్తువులు, శాంసంగ్ టీవీలు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వంటి అనేక రకాల శాంసంగ్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌తో గ్రాండ్ రిపబ్లిక్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌లు శాంసంగ్.క‌మ్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇతర ప్రముఖ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై గరిష్టంగా 22.5శాతం క్యాష్‌బ్యాక్ (రూ.25000 వరకు) పొందవచ్చు.

ఈ బొనాంజా విక్రయ సమయంలో, గెలాక్సీ ఏ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్, ఎస్ సిరీస్, గెలాక్సీ జెడ్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు 57శాతం వరకూ తగ్గింపును పొందవచ్చు. సరికొత్త గెలాక్సీ ఎస్24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రీ-బుకింగ్ చేయడంపై వినియోగదారులు అద్భుతమైన ఆఫర్‌లను కూడా పొందుతారు. గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ కింద, వినియోగదారులు కేవలం రూ.54,999 కి గెలాక్సీ ఎస్ 23ని పొందవచ్చు. గెలాక్సీ బుక్ గో, గెలాక్సీ బుక్ 3, గెలాక్సీ బుక్ 3 ప్రో వంటి గెలాక్సీ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే వారు 46శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన గెలాక్సీ టాబ్లెట్‌లు మోడల్స్, వేరబల్స్, ఉపకరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు 50శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement