Saturday, May 4, 2024

ఏదీ డిసైడ్​ కాలే.. సొంత పార్టీనా, బీజేపీలోకా అన్నది తర్వాత చెప్తా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఆదివారం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని తాను కలవలేదని తేల్చి చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యానని తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురం చర్చించుకున్నామని తెలిపారు.

రాజగోపాల్‌రెడ్డిని మినహా కాంగ్రెస్‌లో ఇతర నేతలను ఎవరినీ కలవలేదని, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాను తటస్థంగా ఉన్నానని ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీలోకి చేరాలని కోరుతున్నారని, అయితే అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పార్టీలోకి వెళ్లాలా..? లేక కొత్తగా పార్టీ పెట్టాలా..? అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement