Tuesday, April 30, 2024

TS : తమది కాలయాపన చేసే ప్రభుత్వం కాదు…మంత్రి పొన్నం

తమది కాలయాపన చేసే ప్రభుత్వం కాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇవాళ‌ హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ధరంకరం రోడ్డులో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు . మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెయ్యి రూపాయల విలువైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలు చేయొద్దని మంత్రి కోరారు.

అభివృద్ధి చేస్తున్న కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి కానీ.. అనవసరమైన విమర్శలు వద్దని హితవు పలికారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్ధానాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆరు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం.. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం నుంచి అనగా శుక్రవారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 200యూనిట్లకు పైన ఒక్క యూనిట్‌ అధికంగా కరెంట్‌ వాడినా పూర్తి బిల్లు కట్టాల్సిందే అని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement