Friday, May 3, 2024

National : మంత్రుల‌కు ప్ర‌ధాని వీడ్కోలు పార్టీ… కేంద్ర కేబినెట్ చివ‌రి భేటి ప్రారంభం….

కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ భేటీ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్‌ సమావేశం కానుంది.

- Advertisement -

మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తుది కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement