Saturday, April 27, 2024

TS: ప్రణీత్ రావుతో ప‌రిచ‌యమే లేదు – ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ – రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో తనకు పరిచయమే లేదని పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ…. ఆయన బంధువులు మాత్రం తమ ఊళ్లోనే ఉన్నారన్న విషయం మాత్రం తనకు తెలిసిందన్నారు. అసలు ఈ కేసులోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ కేసుతో తనకు సంబంధం లేదని విచారణలో స్వయంగా ప్రణీత్‌రావే చెప్పారని గుర్తు చేశారు. పార్టీ మారాలంటూ తనపై ఒత్తిడి ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న శరణ్ చౌదరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని దయాకర్‌రావు తెలిపారు. పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపితే అన్ని నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement