Monday, April 29, 2024

NZB: యువత వ్యాపార రంగాల్లో రాణించాలి… విప్ గంప గోవర్ధన్

బిక్కనూర్, ఆగస్టు 28, ప్రభ న్యూస్: నేటి సమాజంలో యువత పలు వ్యాపార రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. ఇవాళ మండల కేంద్రంలో పలువురు యువకులు నూతనంగా ఏర్పాటు చేసిన బజాజ్ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యాపార రంగాల్లో రాణించే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుర్తు చేశారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ముజీబ్, ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు పురం రాజమౌళి, బజాజ్ షోరూం నిర్వాకులు, శ్రీకాంత్ పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement