Thursday, May 2, 2024

కోటగిరి మండ‌లంలో ఇసుక ట్రాక్ట‌ర్ – బైక్ ఢీ.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

నిజాంబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. కోటగిరి నుండి బైక్ పై ముగ్గురు వ్యక్తులు పోతంగల్ వెళ్తుండగా బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నం ద్విచక్ర వాహనదారులు చేస్తున్న తరుణంలో ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారు కామారెడ్డి జిల్లా మదనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందినవారుగా పోలీసులు చెప్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి కోటగిరి పోలీసులు చేరుకున్నారు. గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మద్నూర్ గ్రామానికి చెందినవారు వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామానికి వెళ్లి నాటు వైద్యులతో వైద్యం చేయించుకుని తిరిగి పోతంగల్ నుండి మదునూరు వెళ్లే ప్రయత్నంలో పోతంగల్ చెక్పోస్ట్ సమీపంలోని కరం రైస్ మిల్ సమీపంలో ప్రమాదానికి గురై ఇరువురు వ్యక్తులు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement