Thursday, May 16, 2024

యధావిధిగా నడుస్తున్న రైల్లు.. రైల్వే స్టేషన్లలో భారీ బందోబస్తు..

కామారెడ్డి : సికింద్రాబాద్ రైలు దగ్ధం పోలీసుల కాల్పుల సంఘటనతో కామారెడ్డి జిల్లా రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్లు యధావిధిగా నడుస్తున్నాయి. రైలు ప్రయాణికులకు ప్రజలకు ఇలాంటి సంఘటన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర పోలీసులు టౌన్ సిఐ నరేష్ ఎస్ఐ భూమన్న సిసిఎస్ సిఐ మల్లేష్ గౌడ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే రిజర్వేషన్ అధికారులు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.ఇతర పోలీసు అధికారుల బృందాలు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నిజామాబాద్ టు బొంబాయిరైలు దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement