Wednesday, May 1, 2024

జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి.. పంచాయతీ అధికారుల విన‌తి

బాన్సువాడ, మే 1 ప్రభ న్యూస్ : తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా జూనియర్ పంచాయతీ అధికారులు సమ్మె చేస్తున్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో డివిజనల్ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ… మూడు సంవత్సరాల పాటు ప్రొఫెషన్ తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయడం లేదన్నారు. కాలయాపన చేస్తూ త‌మ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెగిటివ్ కట్ ఆఫ్ మార్కులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని విధుల్లోకి తీసుకొని ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టామన్నారు. ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేసి ఆదుకోవాలని వారు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement