Thursday, April 25, 2024

TS | పాటకు, ప్రకృతికి విడదీయరాని బంధం.. గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతం: శ్రేయా ఘోషల్

పాటకు, ప్రకృతికి విడదీయరాని బంధం ఉందని, అందుకే తాను గ్రీన్​ ఇండియా చాలెంజ్​లో పాల్గొంటున్నట్టు చెప్పారు బాలీవుడ్​ సింగర్​ శ్రేయాఘోషల్​. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో సింగర్​ శ్రేయా ఘోషల్‌ పాల్గొన్నారు. ఇవ్వాల (సోమవారం) ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్​ పరిధిలోని గచ్చిబౌలిలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి ఆమె మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ గొప్ప కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మొక్కలు పెంచడం, తద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రకృతికి, పాటకు మధ్య విడదీయరాని అనుబంధం ఉందని, రెండింటి సామరస్యంతో సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటామని సింగర్​ శ్రేయాఘోషల్​ అన్నారు.

‘గ్రీన్ ఇండియా యాలెంజ్’ వంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు రాజ్యసభ సభ్యుడు జోగిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ గ్రీన్​ ఇండియా చాలెంజ్​ని మరో ముగ్గురికి ట్విట్టర్ ద్వారా శ్రేయా ఘోషల్​ చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంస్థ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవేందర్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement