Friday, April 26, 2024

కామారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం

టాటా ఏస్‌ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో 9 మంది మృతిచెందగా.. పది మందికి పైగా గాయాలైన ఘటన ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల సాయం అందిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement