Friday, March 29, 2024

వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ

వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎమ్మెల్సీ మధుసూదనచారీ అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారీ మాట్లాడుతూ.. భూపాలపల్లిని జిల్లాగా చేసిన సీఎం కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా జిల్లాను ఏర్పాటు చేసారని అన్నారు. వెనుకబడిన నియోజకవర్గాన్ని సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు సహకారంతోనే అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పెరలాసి యూనిట్, ఐసీయూ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా కాన్సర్ సెంటర్, ట్రామాకేర్, సూపర్ స్పెషలిటీ విభాగాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement