Sunday, May 5, 2024

నిజామాబాద్‌లో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. కపిల హోటల్ లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. హోటల్ లోని 101 రూంలో ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తల బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రకాష్, బార్య అక్షయ, కూతురు ప్రత్యూష (13), బాబు అద్వైత్ (7)గా గుర్తించారు. గత 15 రోజులుగా ప్రకాష్ కుటుంబం హోటల్లోనే ఉంటున్నారు. ప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారo చేస్తున్నాడు. హోట‌ల్ లో సూసైడ్ నోట్ పోలీసులకు లభ్య‌మైంది. ఆర్థిక లావాదేవీలు కారణం అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement