Thursday, May 2, 2024

Breaking: నిజామాబాద్ లో పోలీసుల దాడులు

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. పీఎఫ్ఐ ఆర్గనైజేషన్ శిక్షణా తరగతులు భగ్నం చేశారు. ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను పోలీసులు భగ్నం చేశారు. మత ఘర్షణలకు పాల్పడేలా కుట్ర చేస్తున్నారనే అనుమానంతో దాడులు చేశారు. ఈ శిక్షణా తరగతులకు పలు రాష్ట్రాలకు చెందిన యువకులు హాజరయ్యారు. ఖాదర్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత సాహిత్యం పుస్తకాలు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement