Sunday, May 5, 2024

NZB: ఆర్మూర్ లో ఘనంగా ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను ఆర్మూర్ లో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ అరవింద్ కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరానికి అనుహ్యా స్పందన వచ్చింది.

బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేశారు. భారతదేశ భావితరాలకు భవిష్యత్తు బీజేపీ తోనే సాధ్యమని, దేశంలో మరోసారి ప్రధాని మోడీ ప్రధాని అవుతారని రాష్ట్రంలో సైతం బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆర్మూర్ లో కాషాయ జెండా ఎగరవెసి తీరుతామని పైడ్ రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని, ఆర్మూర్ శాసన సభలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఐక్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకు తీరుతామని బీజేపీ నాయకులు తమ ధీమాను వ్యక్తం చేశారు.

దేవి మాత ఆలయంలో ధన్పాల్ ప్రత్యేక పూజలు..

నిజాంబాద్ నగరంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పుట్టిన రోజు జన్మద సందర్భంగా నగరంలోని దేవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ధంపాల్ సూర్యనారాయణ పండ్ల పంపిణీ చేశారు. అదేవిధంగా నిజాంబాద్ నగరంలోని నిరుపేదలకు, అనాధలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. భవిష్య త్తులో ఎంపీ అరవింద్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిం చి సంపూర్ణ ఆయురారోగ్యా లతో చల్లగా ఉండేలా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement