Thursday, April 25, 2024

కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ లో తమ భూములు పోతున్నాయని తీవ్ర మనోవేదనకు గురైన అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ రైతు పయ్యావుల రాములు బుధవారం ఆత్మహత్యకు పాల్పడగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. మరుసటి రోజు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములను కుట్రపూరితంగా ఇండస్ట్రియల్ జోన్ లోకి తెచ్చారని రైతులు ఆరోపించారు. ఈ సందర్బంగా రైతులు ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు రావాలని బీజేపీ నాయకుడు ధర్నాలో మాట్లాడుతూ హెచ్చరించారు. ధర్నా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement