Friday, May 3, 2024

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న‌ ఘటనలో.. ఒకరు మృతి..

బిక్కనూరు : ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అంతంపల్లి గ్రామ పరిధిలో గల లక్ష్మీనగర్ తండాకు చెందిన బాధవత్ జీవన్(45) అదే గ్రామానికి చెందిన వరుసకు మేనల్లుడైన వినోద్ కు రూ.30 వేలు జీవన్ బాకీ ఉన్నాడు. ఈ డబ్బులు చెల్లించేందుకు జీవన్ భార్య లక్ష్మికి చెందిన పుస్తెలతాడు, కాళ్ల పట్టీలు కామారెడ్డిలో కుదువ పెట్టేందుకు జీవన్ తో పాటు వినోద్ ద్విచక్ర వాహనంపై కలిసి కామారెడ్డి వెళ్లారు.

అక్కడినుండి వారు తిరిగి లక్ష్మీ నగర్ తాండకు వస్తున్నారు. ఇరువురి మధ్య గొడవ జరగగా.. జీవన్ పై వినోద్ తో పాటు మరో వ్యక్తి అయిన ఎంల దాడి చేశారు. దీంతో ఇరువురు కొట్టుకోవడంతో జీవన్ కు తీవ్ర గాయాలైన‌ట్లు వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం 108 అంబులెన్స్ లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించార‌ని వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement