Tuesday, May 14, 2024

TS | భార్య గొంతు నులిమి చంపిన భర్త… నిజామాబాద్​లో ఘటన

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భార్యను గొంతు నులిమి చంపివేయడమే కాకుండా నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యనగర్ లోఈ ఘటన జరిగింది. బోధన్ పట్టణానికి చెందిన ప్రీతి, ప్రవీణ్ ప్రేమ వివాహం చేసుకుని.. నిజామాబాద్ నగరంలోని సూర్య నగర్ లో నివాసముంటు న్నారు.

వీరికి ఒక పాప ఉంది. ఆదివారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ, సూర్యనగర్లో వారు ఉంటున్న అద్దె ఇంట్లో ప్రీతిని ప్రవీణ్ గొంతు నులిమి హత్య చేశాడు. అంతేకాకుండా నాలుగేళ్ల చిన్నారితో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement