Wednesday, May 1, 2024

NZB : కుల సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు కుల సంఘం భవన నిర్మాణాలకు రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. విధుల మంజూరు పత్రాలను వేల్పూర్ లోని మంత్రి స్వగృహంలో కుల సంఘాల పెద్దలకు అందజేశారు. నియోజకవర్గంలోని భీంగల్ మండలం (87 లక్షలతో) 21 కుల సంఘ భవనాలకు అలాగే మెండోరా (రూ.24.50 లక్షలతో) 5 కుల సంఘ భవనాలకు నిధుల మంజూరు ప్రొసీడింగ్స్ కాపీలను సంబంధిత సంఘాల నాయకులకు అందజేశారు. భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో మోటాడి సంఘం, మున్నూర్ కాపు సంఘం, మహారాజుల మాదిగ సంఘం (2), నాయి బ్రహ్మాణ సేవా సంఘం, చెంగల్ గ్రామంలో.. మాల సంఘం, పల్లికొండ గ్రామంలో సీనియర్ సిటీజన్స్, గొల్ల కుర్మా యాదవ సంఘం, సికింద్రాపూర్ గ్రామంలో సేవాలాల్ దేవాలయం కాంపౌండ్ వాల్, బాచన్ పల్లి గ్రామంలో సీనియర్ సిటీజన్స్ సంఘం, మున్నూర్ కాపు సంఘం లకు ప్రోసీడింగ్స్ కాపీలు అందజేశారు.

అలాగే బాబానగర్ కాలనీ గ్రామాల్లో విలేజ్ కమ్యూనిటీ హాల్ భీంగల్ టౌన్ లో బోయిగల్లీ కుమ్మరి సంఘం, గోన్ గొప్పుల గ్రామంలో గంగపుత్ర సంఘం, ద్యావల్ల సంఘం, కుర్మా కొమ్ము సంఘం, కుర్మా చిన్న సంఘం, పురానిపేట్ గ్రామంలో నాకాశి సంఘం(2), జాగిర్యాల్ గ్రామంలో యాదవ సంఘం, మేండోరా మండలం, సొన్ పెట్ గ్రామంలో గంగ పుత్ర సంఘం (2), దూదిగాం గ్రామంలో గంగపుత్ర సంఘం, యాదవ సంఘం, నాయక పోడు సంఘం వెల్క టూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నిర్మాణ నిధుల మంజూరు పత్రాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement