Thursday, May 23, 2024

NZB: అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టండి… గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ (ప్రభన్యూస్) : నిజామాబాద్ అర్బన్ ప్రజలు అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టండని, ఒక్కసారి ఆలోచించి ఆశీర్వదించండని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కోరారు. అభివృద్ధి చేసే పార్టీ ఏది, అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ఎవరనేది ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలోని 39, 40వ డివిజన్ లో చంద్రశేఖర్ కాలనీ, ఎన్జీవో ఎస్ కాలనీ, గౌతమ్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మీ కంటి ముందే అభ్యర్థి.. ఇంటి ముందే అభివృద్ధి ఉందని.. అభివృద్ధికి మద్దతునిస్తూ కారు గుర్తుకి ఓటు వేసి మరో సారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిజామాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి పట్ల విజ్ఞులైన ప్రజలు మరోసారి దీవిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బి.ఆ ర్.ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, కార్పొరేటర్లు నిచెంగు లత కృష్ణ, శివ చరణ్, మాయవార్ సంతోష్, కో అప్షన్ మెంబర్ చంద్ర కళ, ప్రవీణ్ గౌడ్, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement