Tuesday, May 7, 2024

NZB: గావ్ చలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి… బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 4(ప్రభ న్యూస్): పల్లెల్లోని గడప గడపకు బిజెపిని, ప్రధాని మోడీ విధానా లను చేరవేస్తూ… కేంద్ర ప్రభు త్వ పథకాలపై ప్రజలకు అవ గాహన కల్పిస్తూ పార్టీ బలోపే తమే ధ్యేయంగా కృషి చేస్తా మ ని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. రాబోయే పార్లమెంటరీ ఎన్ని కలను దృష్టిలో ఉంచుకొని బిజె పి ఆధ్వర్యంలో గావ్ చలో అభి యాన్ (పల్లెకు పోదాం అభి యాన్) కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

ఈ నెల 5నుంచి 8 వరకు పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గావ్ చలో అభియాన్ (పల్లెకు పోదాం అభియాన్) కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామా బాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ , జాతీయ స్థాయి అధ్య క్షుని వరకు పల్లె ల్లో, నగరా లలో పర్యటించనున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 51 శాతం ఓట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలను, పార్టీ ని పటిష్టం చేయడానికి ఈ కార్య క్రమం చేపట్టినట్లు పేర్కొన్నా రు. పల్లెల అభివృద్ది ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యమని, ప్రజలకు వివరిం చాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో గావ్ చలో అభియాన్ జిల్లా కన్వీనర్ స్వామి యాదవ్, జిల్లా కో కన్వీనర్ సందీప్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతాంకర్ లక్ష్మీ నారాయన, జిల్లా మీడియా ఇంచార్జ్ జశ్వంత్ , నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement