Thursday, May 2, 2024

వసూళ్లకు పాల్పడిన నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

కామారెడ్డి జిల్లాలోని బిచ్‌కుంద పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. కానిస్టేబుళ్లు వి.సంతోష్‌, బి.పరందాములు, సీహెచ్‌ భవిత, మైశ కళ ఇసుక లారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇటీవల వీరిపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ నిర్వహించారు. ఆరోపణలు రుజువు కావడంతో ఎస్పీ శ్వేతారెడ్డి నలుగురికి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బిచ్‌కుంద పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను ఆపి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎస్పీ శ్వేతారెడ్డికి ఫిర్యాదులు అందాయి. వాటిపై శాఖపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించగా.. ఆరోపణలు రుజువు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement