Saturday, April 27, 2024

రైతులకు ఎలాంటి మోసం జరగడం లేదు : సింగరాజుపల్లి సొసైటీ చైర్మన్

నందిపేట్ : మండలంలోని సింగరాజుపల్లి సొసైటీ పరిధిలో బజార్ కొత్తూరు గ్రామంలో తూకంలో మోసమని రైతులు ఆందోళ‌న‌కు దిగారు. దీనిపై స్పందించిన సింగరాజుపల్లి సొసైటీ చైర్మన్ గంగారెడ్డి.. రైతుల‌కు ఎలాంటి మోసం జరగలేదని, ఎవరో కావాలని ఆందోళన చేయడమే కాకుండా సెంటర్ నిర్వాహకులపై దాడి చేయడం శోచనీయమని తెలిసింది. రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు విన్నవించి పరిష్కరించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పాటుపడుతుందని అన్నారు. రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు చేసి ధర కల్పించి ఆదుకోవడానికి ప్రయత్నిస్తుందని చైర్మన్ గంగారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement