Thursday, May 2, 2024

పేలిన గ్యాస్​ సిలిండర్.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఘోరం జరగింది. మైలారం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నడుకుడ రాజారాం, ఆయన భార్య గంగవ్వకు గాయాలైనట్టు సమాచారం. హుటాహుటిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజారాం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సిలిండర్ పైపు లీక్ కావడం, ఇంటికి కిటికీలు లేకపోవడంతో గదిలో గ్యాస్ విస్తరించింది. దీన్ని తెలుసుకోక రాజారాం బీడీ వెలిగించడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికుల అంటున్నారు. గ్యాస్ పేలడంతో గది నాలుగు గోడలు బద్దలయ్యాయి. సంఘటనా స్థలానికి ధర్పల్లి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement