Wednesday, May 1, 2024

రూర్బన్‌ పనులను త్వరగా పూర్తి చేయండి : కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి (జుక్కల్) రూర్బన్ పనులు త్వరతిగతంగా పూర్తి చేయాలని గుత్తేదారులకు, అధికారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. జుక్కల్ మండలంలోని మొహ్మదాబాద్, సవర్ గాం, పాడం పల్లి, జుక్కల్ లో నిర్మాణంలో ఉన్న బస్ షెల్టర్, కూరగాయల పందిరి, గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఆక్సిజన్ పార్క్, ఆడిటోరియం, మినీ స్టిడియం, తదితర పనులను పరిశీలించారు. ఇప్పటికే చాలా ఆల‌స్యమైంద‌ని, త్వరలో మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. ఇదిలా ఉండగా జుక్కల్ మండలంలో 28 కోట్ల రూపాయలతో 363 కొనసాగగా అందులో 49 రకాల పనులు పెండింగ్ లో ఉన్నాయి. కలెక్టర్ వెంట ఉద్యానవన‌ జిల్లా అధికారి విజయ్ భాస్కర్, తహసీల్దార్ గణేష్, ఎంపిడిఓ నరేష్, ఎంపిఓ యాదగిరి, డిపిఎం వినోద్, డీఈ విజయ్ కుమార్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement