Wednesday, May 1, 2024

బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ క‌పూర్.. వైర‌ల్ గా ఫొటోస్

హిందీ భామ జాన్వీక‌పూర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్ట‌నుంది. కాగా త‌న బాయ్‌ఫ్రెండ్ శిఖ‌ర్ ప‌హ‌రియా తో క‌లిసి ముంబ‌యి ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది జాన్వీక‌పూర్. ఇటీల జాన్వీ, శిఖ‌ర్‌లు ప‌బ్లిక్‌గా ప‌లుమార్లు క‌నిపించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ ప‌రిచ‌యంపై జాన్వీ మాత్రం ఎటువంటి కామెంట్ చేయ‌లేదు. మ‌హారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మ‌నువ‌డే శిఖ‌ర్ ప‌హ‌రియా. జాన్వీ, శిఖ‌ర్‌ల మ‌ధ్య చాన్నాళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. నీతా అంబానీ ఈవెంట్‌కు హాజ‌రైన జాన్వీతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా వ‌చ్చాడు. వైట్ డ్రెస్సులో జాన్వీ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు రాగానే.. ఇద్ద‌రూ వేర్వేరు కార్ల‌లో వెళ్లిపోయారు. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. నీతా అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ రెడ్‌కార్పెట్‌లో జాన్వీ క‌పూర్ త‌న తండ్రి బోనీ కపూర్‌తో క‌లిసి శిఖ‌ర్ కూడా ఫోటోలు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement