Sunday, April 28, 2024

Nzb: 18న రావుట్లకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఎన్నికల కమిషనర్

సిరికొండ, జులై 16 ( ప్రభ న్యూస్ ): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ రిక్క లింబాద్రి ఈనెల 18న నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి విచ్చేయన్నట్లు గ్రామ సర్పంచ్ భూదేవి రాజిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు తోట రాజన్న, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి స్వంత గ్రామానికి విచ్చేస్తున్న సందర్బంగా గ్రామంలో పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారథి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి రవీందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డి.రామచంద్రం, విశ్రాంత న్యాయమూర్తి నిమ్మ నారాయణ, చేయూత స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధు శేఖర్ తదితరులు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ లింబాద్రి తో కలిసి చదువుకున్న సహచరులు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement