Saturday, May 4, 2024

పాడి పంటలతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి.. సభాపతి పోచారం

పాడిపంటలతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలోని పదవ వార్డులో సాయి కృపానగర్ కాలనీలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు బోనాల పండుగలో బోనమెత్తి మహిళలతో పాలుపంచుకున్నారు.

గ్రామ దేవతలకు పూజలు చేసి శాంతింప చేస్తే గ్రామాల ప్రజలు అమ్మవారి ఆశీస్సులు పొంది పాడిపంటలకు విలసిల్లుతారని సభాపతి అన్నారు. సాయి కృపానగర్ లో నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాకారా బ్యాంక్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement