Wednesday, May 15, 2024

NZB: అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్..

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 12 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీ, భూమి నుండి ఆకాశం వరకూ అన్నిచోట్లా అవినీతికి పాల్పడిన ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ న్యాలంరాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ న్యాలంరాజు ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలిపి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా న్యాలం రాజు మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. జార్ఖండ్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేయగా.. లభ్యమైన రూ.350 కోట్ల నల్లధనం ఏమిటని… అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా అక్రమ సంపదతో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ధీరజ్ సాహు దగ్గర నోట్లగుట్టలను కూడబెడుతుందనీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓ ఎంపీ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం, ఇండియా కూటమి ఈ అవినీతిపై మౌనంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఎంపీలకు అవినీతిలో ప్రమేయం ఉండటం ఇది తొలిసారి కాదు.. స్కామ్ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటారన్నారు. భారత్ జోడో యాత్ర కోసం ధీరజ్ సాహు డబ్బులు ఇవ్వడం వీరిద్దరు కలిసి చేసిన యాత్ర భారత్ జోడో యాత్ర కాదు దొంగల యాత్ర అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ సీఎంలు, ఇప్పుడున్న ఎంపీలు, ఆఖరుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కూడా అవినీతి కేసులున్నాయన్నారు. అవినీతిపరులను కఠినంగా శిక్షించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శివ ప్రసాద్, దొంతుల రవి, ఇప్పాకయల కిషోర్, కుమార్, సందీప్, బుస్సాపూర్ శంకర్. మాస్టార్ శంకర్, గడ్డం రాజు, పుట్ట వీరేందర్, చిరంజీవి, సాయి పవర్, పంచారెడ్డి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement