Monday, May 20, 2024

Breaking: రోడ్డెక్కిన కమలం పంచాయతీ… ఎంపీకి వ్యతిరేకంగా నాయకుల ఆందోళన

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యాలయం వద్ద నాయకులు ఆందోళనకు దిగారు. ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ఎదుట ఇవాళ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

13మండలాల అధ్యక్షులను మార్చడం నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీసుకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఎంపీ అరవింద్ కు జై కొడితేనే పదవులా అని ప్రశ్నించారు ? ఎంపీ అరవింద్ తీరును నిరససిస్తూ పార్టీ కార్యాలయం ఎదుట మూడు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement