Thursday, May 2, 2024

Kamareddy: మాజీ జవాన్ కు సత్కారం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లింగంపేట్ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆజాదికా అమృత్ ఉత్సవ్ లో భాగంగా మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ జవాన్ శంకర్ ను మండల బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దత్తురా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరునికి అండగా ఉంటుందన్నారు.

ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న ప్రతి పౌరులు దేశ రక్షణకై తమ కుటుంబాలకు దూరం ఉంటూ విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజుల మురళి రాంచందర్ బొల్లారం సాయిలు ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు చేపూరి పోశెట్టి, తల్వార్, సాయిలు, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement