Sunday, May 5, 2024

Nizamabad- దొరల పాలనకు చరమ గీతం పాడాల్సిందే – అలీ షబ్బీర్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)13:తెలంగాణలో దొరలపాలనను సాగనంపి. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందామని మాజీ మంత్రి నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని నాగారంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రక టించిన ఆరు హామీ పథకాలను తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు . తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుం టోందని ఆరోపించారు. రాష్ట్రం లో ఇసుక ల్యాండ్, కాంట్రాక్టర్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యే ల దోపిడీ కనిపిస్తుందని చెప్పారు. అధికా రంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుం దని స్పష్టం చేశారు.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహి ళలకు రూ. 2500 అంది స్తామ ని చెప్పారు

.ఈ కార్యక్రమంలో కేశవ వేణు, ధర్మపురి సంజయ్, రత్నాకర్,నజీబ్ అలి, జావిద్ అక్రమ్. అబ్దుల్ ఎజాస్. షాదాబ్ హుస్సేన్. అబ్దుల్ ముఖిం, ఇర్ఫాన్ అలీ, మోయిన్ .గౌస్.అన్వర్. దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement