Thursday, May 9, 2024

పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి – కేసీఆర్ మొక్క‌వోని దీక్ష‌కు నిద‌ర్శ‌నమంటూ హరీష్ రావు ప్రశంస

 హైదరాబాద్ -: పాల‌మూరు వ‌ర ప్ర‌దాయిని పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు అయ్యాయి. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ద‌శాబ్దాలుగా అన్యాయానికి, వివ‌క్ష‌కు గురైన పాల‌మూరుకు కృష్ణ‌మ్మ ప‌రుగు ప‌రుగున రానుంద‌ని మంత్రి పేర్కొన్నారు.

పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తులు కేసీఆర్ ఘ‌న‌త అని కొనియాడారు. కేసీఆర్ మొక్క‌వోని దీక్ష‌కు నిద‌ర్శ‌నం ఇది. ప్ర‌భుత్వం ప‌ట్టువిడ‌వ‌ని ప్ర‌య‌త్నం తోడై సాధించిన ఫ‌లిత‌మిది. ఇది మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని మ‌ధుర ఘ‌ట్టం. పాల‌మూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మార్చే ఈ ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు రావ‌డం అపూర్వ ఆనందాన్ని ఇస్తుంద‌ని హ‌రీశ్‌రావు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement