Monday, April 29, 2024

Gold Mine – బుద్వేల్‌లో భూ వేలం పూర్తి – వంద ఎకరాలు రూ.3,625.73 కోట్లకు అమ్మకం

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లో చేపట్టిన భూముల వేలానికి మంచి స్పందన లభించింది. గురువారం రెండు విడతల్లో చేపట్టిన ఈ వేలంలో మొత్తం 14 ప్లాట్లను విక్రయించారు.

మొత్తం 100.01 ఎకరాలను విక్రయించినట్టు హెచ్‌ఎండీఏ వెల్లడించింది. ఈ వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75 కోట్లు పలికింది. యావరేజ్‌గా ఎకరం ధర రూ.36.25 కోట్లు పలికిందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్వేల్‌లో ప్లాట్ల విక్రయం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.3,625.73 కోట్ల ఆదాయం సమకూరింది

Advertisement

తాజా వార్తలు

Advertisement