Sunday, April 28, 2024

కేంద్ర ఐటీ శాఖ మంత్రికి బ్లూ టిక్ తీసేసిన ట్విట్టర్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న తరుణంలో ట్విట్టర్ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా కొత్తగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్‌ ఖాతాకు ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్‌ను తొలగించింది. అయితే బ్లూ టిక్ మార్క్ తొలగింపుపై ట్విట్టర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే.. రాజీవ్ చంద్రశేఖర్.. తన ట్విట్టర్ ఖాతా పేరును రాజీవ్ ఎంపీ నుంచి రాజీవ్ జీవోఐగా మార్చడం వల్ల ఇలా జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, గతంలో ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రుల ఖాతాకు బ్లూ టిక్ ను తొలిగించి ట్విట్టర్ విమర్శలు ఎదర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement