Friday, April 26, 2024

ఓటు హ‌క్కును బాధ్య‌త‌గా వినియోగించుకోవాలి : సీఈవో వికాస్‌రాజ్

ఓట‌ర్లు ఓటు హ‌క్కును బాధ్య‌త‌గా వినియోగించుకోవాల‌ని సీఈవో వికాస్‌రాజ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తినట్లు, మరోచోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడంతో రీప్లేస్‌ చేసినట్లు చెప్పారు. ఈవీఎం సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు వివరించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement