Thursday, May 9, 2024

Nalgonda : పార్టీ మారడం లేదు… దుష్ప్రచారం కరెక్ట్ కాదు… ఉత్తమ్

తాను కాంగ్రెస్ పార్టీని వీడడం లేదని, అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదని నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ వచ్చిన సంగతి తెలిసిందే. నేతలు సైతం విభేదాలను పక్కనబెట్టి పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. దీనికి తోడు బలమైన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కడాలేని జోష్ నెలకొంది. అయితే నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వార్తలు రావడంతో.. ఆయన స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement