Wednesday, May 1, 2024

Suryapet – అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత‌ భట్టి విక్రమార్కకి మాజీ మంత్రి సంభాని ప‌రామ‌ర్శ‌..

సూర్యాపేట – పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇటీవల వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ని సూర్యాపేట జిల్లా ఉప్పలపాడ్ గ్రామంలో మాజీమంత్రి, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కలుసుకొని పరామర్శించారు. ఆయ‌న ఆరోగ్య పరిస్థితులు గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు సంభాని, భ‌ట్టి ఆరోగ్యం కుదుట‌ప‌డ‌టంతో సంతృప్తి వ్యక్తం చేసిమ‌రింత‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో వందవ రోజుకి చేరుకోవడంతో శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ Sc Dpt కన్వీనర్ కొండూరు కిరణ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్ నాయుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ళ అప్పారావు, దగ్గుల రఘుపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివా వేణు, పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెలికాని రాజబాబు, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్, నియోజకవర్గ ST సెల్ అధ్యక్షులు హలావత్ వెంకటేశ్వర్లు, సత్తుపల్లి టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ, పెనుబల్లి మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య,దగ్గుల నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రాజేష్, ఇజ్జగాని మధు, లక్ష్మారెడ్డి, పోతురాజు నరేంద్ర, చలపతి రెడ్డి, కేవీ నాయుడు, సర్పంచ్ ప్రేమలత బుచ్చాలు, జిల్లా నాయకులు హఫీజ్, జిల్లా మహిళా ఉపాద్యక్షురాలు బానోతు వినోద, సూర్యనారాయణ రెడ్డి, రాంబాబు, సైదులు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement