Wednesday, May 15, 2024

Bhadradri: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

ప‌దో త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలోని చోటుచేసుకుంది. జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఆనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 19న హాస్టల్ నుండి ఇంటికి వెళ్లింది. విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఈనెల 27న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement