Thursday, May 2, 2024

అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసులో ఎస్సై, కానిస్టేబుల్‌పై వేటు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్ కేసులో ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. కాగా మూడురోజుల క్రితం అడ్డగూడూరు పీఎస్‌లో పోలీస్ దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. సదరు మహిళ దళితురాలు కావడంతో ఈ అంశంపై పెద్ద దుమారమే రేగింది. మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ కూడా రాశారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని వారు లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement