Thursday, April 25, 2024

డబ్ల్యూటీసీ ఫైనల్: 249 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 32 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కాన్వే 54, విలియమ్సన్ 49, సౌథీ 30, లాథమ్ 30, జేమీసన్ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీకి 4, ఇషాంత్‌కు 3, అశ్విన్‌కు రెండు వికెట్లు లభించగా జడేజా ఓ వికెట్ సాధించాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 217 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement