Sunday, May 19, 2024

రాజగోపాల్ రెడ్డి హామీలకు విలువ లేదు.. పూటకొక అబద్ధం : మంత్రి జగదీశ్ రెడ్డి

న‌ల్ల‌గొండ : కేంద్ర ప్ర‌భుత్వం యాదాద్రి గుడికి వంద రూపాయలు ఇవ్వలేదు కానీ.. కోమటిరెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింద‌ని మంత్రి జగదీశ్ రెడ్డి మండిప‌డ్డారు. రాజగోపాల్ రెడ్డి హామీలకు విలువ లేద‌ని, పూటకొక అబద్ధం మాట్లాడటం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని కేంద్రంపై మంత్రి మండిప‌డ్డారు. యాదాద్రి ఆలయాన్ని రూ.1,000 కోట్లతో కడితే ప్రధాని మోదీ రూ.100 చందా కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి మాత్రం మోదీ రూ.18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. రాజగోపాల్ కు ఇచ్చిన రూ. 18,000 కోట్లను నల్గొండ, మునుగోడు అభివృద్ధికి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… రాజకీయాల కోసం మాత్రం వేల కోట్ల కాంట్రాక్టులను కట్టబెడుతోందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement